అమరావతి, ఫిబ్రవరి 8 (న్యూస్టైమ్): విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖ సముద్రతీరంలో 13.59 ఎకరాల్లో ప్రాజెక్టు ప్రతిపాదనలపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. ఇదే భూమిని లూలూ గ్రూప్కు కారుచౌకగా 33 ఏళ్ల లీజుకు గత ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పారు.
ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు ఎన్బీసీసీ, ఏపీఐఐసీ సీఎంకు వివరాలు అందించారు. కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాల వల్ల కనీసం ప్రభుత్వానికి రూ.1450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్బీసీసీ వెల్లడించింది. తాజాగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ, ఏపీఐఐసీ సీఎంకు వివరాలు అందించాయి.
కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ల నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి కనీసం సుమారు రూ.1,450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్బీసీసీ వివరించింది. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్ఏ నీరబ్కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఏఎంఆర్డీఏ కమిషనర్ పి.లక్ష్మీ నరసింహం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.