2020-21 బడ్జెట్ అంచనాలు 137 శాతం పెంపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో 2021-22 కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు. ఇది ఈ కొత్త దశాబ్దం మొదటి బడ్జెట్, కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో అపూర్వమైన మరియు డిజిటల్ బడ్జెట్‌ కూడా. ఆత్మనిర్భర్ భారత్ సాధనపై దృష్టి పెట్టిన ఆమె 130 కోట్ల మంది భారతీయుల సామర్థ్యాలు, నైపుణ్యాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తీకరణ ఇది అన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలు సంకల్ప్ ఆఫ్ నేషన్ ఫస్ట్, రైతులకు రెట్టింపు ఆదాయం, బలమైన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన భారతదేశం, సుపరిపాలన, యువతకు అవకాశాలు, అందరికీ విద్య, మహిళా సాధికారత మరియు సమగ్ర అభివృద్ధి వంటివి మరింత బలోపేతం అవుతాయని ఆమె అన్నారు.

అదనంగా మరియు వేగంగా అమలు చేసే మార్గంలో కూడా 2015-16 బడ్జెట్ 13 వాగ్దానాలు ఉన్నాయి- ఇవి 2022 నాటికి మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ నాటికి కార్యరూపం దాల్చుతాయి. అలాగే అవి ఆత్మనిర్భర్‌ భారత్‌ను కూడా ప్రతిధ్వనిస్తాయి అని ఆమె తెలిపారు. 6 మూలస్తంభాలపై ఆధారపడి 2021-22 బడ్జెట్‌ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆరోగ్యం, శ్రేయస్సు, భౌతిక & ఆర్థిక మూలధనం, మౌలిక సదుపాయాలు, యాస్పిరేషనల్ ఇండియా కోసం సమగ్ర అభివృద్ధి, మానవ మూలధనాన్ని పునరుజ్జీవింపచేయడం, ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి.

ఆరోగ్య మౌలిక సదుపాయాల పెట్టుబడులలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం బడ్జెట్ వ్యయం బిఈ 2021-22లో రూ .2,23,846 కోట్లు. బడ్జెట్ ఇయర్ 94,452 కోట్ల రూపాయలతో పోలిస్తే ఇది 137 శాతం పెరుగుదల. 6 సంవత్సరాలలో సుమారు రూ.64,180 కోట్ల రూపాయల వ్యయంతో కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం పిఎం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్ యోజనను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇది ప్రాధమిక, ద్వితీయ, తృతీయ సంరక్షణ ఆరోగ్య వ్యవస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే ఉన్న జాతీయ సంస్థలను బలోపేతం చేస్తుంది. కొత్త, అభివృద్ధి చెందుతున్న వ్యాధులను గుర్తించడానికి, నయం చేయడానికి కొత్త సంస్థలను సృష్టిస్తుంది. ఇది జాతీయ ఆరోగ్య మిషన్‌కు అదనంగా ఉంటుంది. పథకం కింద ప్రధాన ఆంశాలు: 17,788 గ్రామీణ, 11,024 పట్టణ ఆరోగ్య, సంరక్షణ కేంద్రాలకు మద్దతు, అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు, 11 రాష్ట్రాల్లో 3382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేయడం; 602 జిల్లాలు, 12 కేంద్ర సంస్థలలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాకులను ఏర్పాటు చేయడం; నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి)తో పాటు దాని 5 ప్రాంతీయ శాఖలు, 20 మెట్రోపాలిటన్ హెల్త్ విభాగాల బలోపేతం; అన్ని ప్రజారోగ్య ప్రయోగశాలలను అనుసంధానించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ విస్తరణ; 32 కొత్త విమానాశ్రయాలు, 11 నౌకాశ్రయాలు, 7 ల్యాండ్ క్రాసింగ్ల వద్ద ఉన్న 17 కొత్త ప్రజారోగ్య యూనిట్ల నిర్వహణ, ప్రస్తుత ఉన్న 33 పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఎంట్రీ పాయింట్ల వద్ద బలోపేతం చేయడం; 15 ఆరోగ్య అత్యవసర ఆపరేషన్ కేంద్రాలు, 2 మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేయడం; వన్ హెల్త్ కోసం ఒక జాతీయ సంస్థను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ కోసం ప్రాంతీయ పరిశోధనా వేదిక, 9 బయో-సేఫ్టీ లెవల్ III ప్రయోగశాలలు, 4 ప్రాంతీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ వైరాలజీల ఏర్పాటు చేయనున్నారు.

2021-22 బడ్జెట్‌ సంవత్సరంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం రూ .35,000 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కేవలం 5 రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి అయిన న్యుమోకాకల్ వ్యాక్సిన్ ఏటా 50,000 మంది పిల్లల మరణాలను నివారించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పోషక ఉత్పత్తుల పెంపుదల, సరఫరా, ఔట్రీచ్‌, ఫలితాన్ని బలోపేతం చేయడానికి, ప్రభుత్వం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం, పోషాన్ అబియాన్‌ను విలీనం చేస్తుంది. మిషన్ పోషన్ 2.0ను ప్రారంభిస్తుంది. 112 జిల్లాలలో పోషక ఫలితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం వ్యూహాన్ని అనుసరిస్తుంది.

Latest News