అరకు: అరకులోయ మండలం మాదల పంచాయతీ మెదర్ సొల చిట్టంగొంది బాక్సైట్ అటవీ ప్రాంతంలో బుధవారం కురిసిన భారీ వర్షాల కారణంగా భారీ పిడుగు పడింది.ఈ పిడుగుపాటుకు 13 ఆవులు 6 మేకలు మృత్యువాత పడ్డాయి.పశువులు కాయడానికి వెళ్ళిన గెమ్మెలి.భీమన్న అనే గిరిజనుడు తోపాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి.దీనితో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స కోసం అరుకు ఏరియా ఆస్పత్రికి డోలిమోత సహాయంతో బంధువులు తీసుకుని వెళ్ళారు.బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి కె.రామరావు గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్నలు డిమాండ్ చేశారు.ఈ ఘటనతోపాటు డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ సిలంగొంది అటవీ ప్రాంతంలో పిడుపడి 12 దుక్కిటెద్దులు మృతి చెందాయి.ఒకేసారి గిరిజన కుటుంబాల్లో ఇంత భారీ నష్టం జరగడంతో గిరిజనులు మున్నీరు అవుతూ ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన చెందుతున్నారు…