విజయవాడ, ఆగష్టు – 19 : రాష్ట్ర బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి పాల్గోని విజయవాడ ఇద్రకీలాద్రి పై వెలసిన దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కిషన్ రెడ్డి.దర్శనాంతరం అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్ద ప్రసాదాలు అందచేత కిషన్ రెడ్డితో పాటు దుర్గమ్మను దర్శించుకున్నరాష్ట్ర బిజెపి అధ్యక్షులు సోమూవీర్రాజు,రాజ్యసభ ఎంపి సిఎం రమేష్,ఎమ్మెల్సి మాదవ్ పాల్గోన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ –
కేంద్ర మంత్రి గా బాధ్యతలు స్వీకరించాక తెలుగు ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చాను.నిన్న తిరుపతి వెంకటేశ్వరస్వామిని,ఇవాళ దుర్గమ్మను దర్సించుకున్నాదేశ సంస్కృతి, సాంప్రదాయాల ను పరిరక్షించాలని మోడీ అకాంక్షించారని తెలిపారు.వరంగల్ లోని వీరబద్ర దేవాలయాన్నియునెస్కొ హెరిటేజ్ సెంటర్ గా గుర్తించిందని.రానున్నరోజుల్లో ఎపి లో 126 కేంద్రాలున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి అభివృద్ధి చేస్తామన్నారు . ప్రభుత్వ, ప్రైవేట్ సంస్ధలను పిలిచి సిఎస్అర్ ఫండ్ కింద అభివృద్ధి చేస్తాం.టూరిజం డిపార్ట్మెంట్ చాలా ఛాలెంజ్ తో కూడుకుందని .గత రెండేళ్లుగా కోవిడ్ తో టూరిజం దెబ్బతిందన్నారు.జనవరి 1 నాటికి కోవిడ్ తగ్గగానే టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.భారత్ దర్శన్ ద్వారా చారిత్రాత్మక కట్టడాల విశిష్టతను అందరికీ తెలిపే విధంగా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.పర్యటక శాఖ ద్వారా నా వంతు సహకారం తెలుగు రాష్ట్రాలకు తెలుగువాడిగా అందిస్తానన్నారు, ఏపి, తెలంగాణా మోడీకి రెండు కళ్లులాంటివి సిఎం జగన్ మర్యాద పూర్వకంగానే ఆహ్వానించారు. తెలుగు వాడికి కేంద్రమంత్రి అవకాశం రావడంతోనే తేనేటి విందుకు ఆహ్వానించారు .దుర్మమ్మ ఆలయాన్ని టూరిస్ట్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నా సహకారం అందిస్తానని తెలిపారు…