నర్సీపట్నం : నర్సీపట్నంలో భారీగా పట్టుపడిన తెలంగాణా మద్యం.జీడిపిక్కల బిజినెస్ ముసుగులో మద్యం అక్రమ రవాణా వైసీపీ మాజీ కౌన్సిలర్ వర్రే శ్రీనివాసరావు ఇంటిలో పట్టుబడిన తెలంగాణా మద్యం బాటిళ్లు. అనుచరుడి ఇంటిలోనూ దొరికిన తెలంగాణా మద్యం.వర్రే శ్రీనివాసరావుని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.గత కొన్ని రోజుల నుంచి మద్యం అక్కడ నుంచి తెచ్చి అధిక రేట్లకు అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో గత రాత్రి దాడి చేసి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని సి.ఐ సంతోష్ కుమార్ తెలిపారు.