అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న120కేజిల గంజాయి ప‌ట్టివేత‌

గొలుగొండ : అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 120కేజిల గంజాయిని పోలీసులు ప‌ట్టుకున్నారు.దీని విలువ 5ల‌క్ష‌లు ఉంటుద‌ని ఎస్సై ఉమామ‌హేశ్వ‌ర‌రావు పేర్కోన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏటిగైరంపేట వ‌ద్ద ఉద‌యం 7.30 గంట‌ల‌కు ప‌ట్టుకున్నామ‌ని తెలిపారు.ప‌ట్టుబ‌డ్డ ఈ గంజాయి ఆటోలో ఏజెన్సీ నుండి న‌ర్సీప‌ట్నం త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్నామ‌న్నారు.పోలీసులు చేసిన త‌నిఖీల‌లో ఆటో నుండి ఇద్ద‌రు త‌ప్పించుకోగా 5గురు ప‌ట్టుప‌డ్డార‌ని తెలిపారు.వీరి నుండి 6 సెల్‌పోన్లు,16వేల 280రూ..లు న‌గ‌దు స్వాదీనం చేసుకున్నామ‌న్నారు.ప‌ట్టుబ‌డ్డ నిందుతుల‌లో పాడేరుకు చెందిన షేక్ నోనిషా,కె.విజ‌య్‌కాంత్ ,నీలంపేట‌కు చెందిన లాలం గ‌ణేష్‌,అప్ప‌ల‌నాయుడు, న‌ర్సీప‌ట్నంకు చెందిన సి.హెచ్ లీలాకృష్ణల‌పై కేసును న‌మోదు చేసి విశాఖ‌ప‌ట్నం రిమాండ్ కు త‌ర‌లించామ‌ని,పారిపోయిన ఇద్ద‌రు నిందుతులను గాలిస్తున్నామ‌ని ఎస్సై తెలిపారు.

Latest News