Uncategorized

ఖరీఫ్‌లో 8796717 పత్తి బేళ్ల సేకరణ

1802025 లక్షల మంది రైతులకు ప్రయోజనం..

న్యూఢిల్లీ, జనవరి 27 (న్యూస్‌టైమ్): 2020-21 ఖరీఫ్ పంట మార్కెటింగ్ సీజన్‌లో కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్నది. గత సీజన్లలో మాదిరిగానే ఈ ఏడాది కూడా అమలులో ఉన్న కనీస మద్దతు ధర పథకం కింద ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది. వరిని పండిస్తున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పంట సేకరణ సజావుగా సాఫీగా సాగుతున్నది. ప్రస్తుత ఖరీఫ్ 2020-21 సీజన్‌లో ఇంత వరకు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీఘర్, జమ్మూ కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘర్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో రైతుల నుంచి 583.31 లక్షల మిలియన్ టన్నులకు పైగా వరిని సేకరించడం జరిగింది. గత ఏడాది ఇదే సమయానికి రైతుల నుంచి 483.921 లక్షల మిలియన్ టన్నుల వరిని కొనుగోలు చేశారు.

గత ఏడాదితో పోల్చి చూస్తే ఇంతవరకు వరి సేకరణ 20.53% పెరిగింది. సేకరించిన మొత్తం 583.31 లక్షల మిలియన్ టన్నుల వరిలో 34.76 శాతం అంటే 202.77 లక్షల మిలియన్ టన్నులను ఒక్క పంజాబ్ రాష్ట్రంలోనే సేకరించడం జరిగింది. ఇంతవరకు 110130.52 కోట్ల రూపాయల విలువ చేసే వరిని 84.06 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి సేకరించడం జరిగింది. ఇంతే కాకుండా రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల మేరకు ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ కాలం 2020లో రైతుల నుంచి ధర మద్దతు పధకం (పిఎస్ఎస్) కింద 51.92 లక్షల మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను కొనుగోలు చేయడానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనితోపాటు 1.23 లక్షల మిలియన్ టన్నుల ఎండు కొబ్బరిని రైతుల నుంచి కొనుగోలు చేయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి.

​ఇంతేకాకుండా 2020-21 రబీ మార్కెటింగ్ సీజన్‌లో రైతుల నుంచి 2.50 లక్షల మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు, నూనెగింజలను సేకరించడానికి గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు అనుమతులు జారీ అయ్యాయి. ప్రతిపాదనలు అందిన వెంటనే ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ధర మద్దతు పధకం కింద పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరిని సేకరించడానికి అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. దీనివల్ల 2020-21 ఖరీఫ్ పంట కాలంలో నిర్ణీత గ్రేడ్ కలిగిన ఈ పంటలను నమోదు చేసుకున్న రైతుల నుంచి ఆయా రాష్ట్రాలలో కనీస మద్దతు ధర కన్నా మార్కెట్ ధర తగ్గినప్పుడు కేంద్రం నియమించే నోడెల్ ఏజెన్సీల ద్వారా రాష్ట్రాలు నియమించే సేకరణ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు నేరుగా సేకరించడానికి అవకాశం కలుగుతుంది.

ఇప్పటి వరకు ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా 1621.28 కోట్ల రూపాయల విలువ చేసే 3,00,623.38 మిలియన్ టన్నుల సెనగలు, వేరుశెనగ, సోయాబీన్, మినుములను సేకరించింది. దీనివల్ల తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలలో 1,61,765 మంది రైతులు లబ్ది పొందారు. ఇదేవిధంగా కర్నాటక, తమళనాడులలో 3961 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ వారినుంచి 52.40 కోట్ల రూపాయల విలువ చేసే 5089 మిలియన్ టన్నుల ఎండుకొబ్బరిని సేకరించడం జరిగింది. కొబ్బరి, మినుములు ఎక్కువగా సాగవుతున్న రాష్ట్రాలలో కనీస మద్దతు ధరల కంటే మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.

సంబంధిత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఖరారు చేసే తేదీ నుంచి ఖరీఫ్ పప్పు ధాన్యాలు నూనె గింజలు మార్కెట్టుకు రావడం ప్రారంభించిన తరువాత సేకరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 2020 -21 ఖరీఫ్ పంట కాలంలో పత్తిగింజల సేకరణ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాలలో చురుగ్గా సాగుతున్నది. నేటి వరకు కనీస మద్దతు ధర పథకం కింద 25691.35 కోట్ల రూపాయల విలువచేసే 8796717 బేళ్ల పత్తిని 1802025 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ సేకరించడం జరిగింది.