విశాఖపట్నం, ఫిబ్రవరి 17 (న్యూస్టైమ్): పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదా పీఠం వార్షికోత్సవంలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్వాగతం పలికారు. శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ పాల్గొని స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలు చేశారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమవ్వగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.