నాడు-నేడు పనులపై సీఎం సమీక్ష

అమరావతి, మార్చి 4 (న్యూస్‌టైమ్): అంగన్‌వాడీలలో నాడు–నేడు, వైయస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ. ఆర్‌. అనురాధ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్‌ సర్సీసెస్‌) జి. పాలరాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డాక్టర్ కాటమనేని భాస్కర్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, బీసీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ బి. రామారావు, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, మెప్మా ఎండీ వి. విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Latest News