తెలంగాణ

తెలంగాణ సీఎస్‌తో ఈస్టోనియా అంబాసిడర్ భేటీ

హైదరాబాద్, మార్చి 6 (న్యూస్‌టైమ్): ఈస్తోనియా అంబాసిడర్ కత్రీన్ కివి, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ జుయి హిఓ బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్నపలు సంస్కరణలను ఈస్తోనియా డెలిగేట్స్‌కు వివరించారు. అందులో భాగంగా చేపట్టిన ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్, ఇ-గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ, అభివృద్ది, సంక్షేమ పథకాల గురించి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా డెలిగేట్స్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.ఎ.ఎం. రిజ్వీ, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరీ అర్విందర్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.