న్యూస్ప్రాంతీయంరాజకీయంరాష్ట్రీయంవిశాఖపట్నం

గిరిజ‌నులు స్వాతంత్య్ర ఉద్య‌మంలో భాగ‌మ‌య్యార‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఉంది.

*పోరాట యోధుడు గాం గంటందొర శ‌త వ‌ర్థంతి వేడుక‌ల్లో పాడేరు శాస‌న స‌భ్యులు శ్రీ‌మ‌తి కొట్టగుళ్ళి భాగ్య‌లక్ష్మి.

*గాం గంటందొర కాంస్య విగ్ర‌హావిష్క‌ర‌ణ‌, ఘ‌నంగా నివాళుల‌ర్పించిన ఎంపీ మాధ‌వి, ఐటీడీఏ పీవో అభిషేక్‌.

కొయ్యూరు,కోస్తా టైమ్స్ ( జూన్ -07) : గాం గంటం దొర‌, గాం మల్లు దొర, బోనంగి పండు పడాల్‌, అగ్గి వీరయ్య దొర ,ఇలా అనేకమంది గిరిజ‌నులు స్వాతంత్య్ర‌ ఉద్యమంలో భాగ‌మైనందుకు గిరిజ‌న శాస‌న సభ్యురాలుగా ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని పాడేరు శాస‌న స‌భ్యురాలు, కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి అన్నారు. కొయ్యూరు మండలం బట్ట పనుకుల పంచాయ‌తీ ,లంక వీధి గ్రామంలో స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు గాం గంటం దొర శ‌త వ‌ర్థంతి వేడుక‌లు బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గాం గంటం దొర‌ కాంస్య విగ్రహాన్నిఎంపీ గొడ్డేటి మాధ‌వి,ఐటీడీఏ పీవో అభిషేక్,పాడేరు శాస‌న స‌భ్యులు కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి ఆవిష్కరించి, పూలమాల‌లు వేసి ఘనంగా నివాళులర్పించారు.పాడేరు ఐటిడిఏ, క్షత్రియ సేవా స‌మితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గంటం దొర కుటుంబ సభ్యులకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశారు. వచ్చే ఏడాది ఇదే సమయానికి వారికి గృహ నిర్మాణాల పూర్తి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ , స్వాతంత్య్ర ఉద్య‌మంలో మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన గాం గంటందొర కుటుంబ సభ్యులు నిలువ నీడ లేకుండా ఉన్న పరిస్థితులు అధ్యయనం చేసి ఈరోజు వారందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసి గృహ నిర్మాణానికి పూనుకున్న ఎన్ సీసీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏడాది ఇదే తేదీ నాటికి ఆ ఇళ్ల‌ నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా జరగాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు ఒక క్షత్రియ వర్గానికి చెందిన వారైనప్పటికీ , గిరిజనుల సమస్యలపై పోరాటం చేసి స్వతంత్ర ఉద్యమంలో మ‌ల్లు దొర‌, గంటం దొర‌, పండు పడాల్ వంటి స్థానిక నాయకులకు శిక్షణ ఇచ్చి బ్రిటిష్ వారు నుంచి విముక్తి కోసం పోరాడేలా తీర్చిదిద్ది స్వాతంత్య్రోద్య‌మంలో కీలక భాగస్వామ్యం చేశారనీ కొనియాడారు. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మన ఆదివాసి యోధులు చేసిన పోరాటాన్ని మనమంతా ఆదర్శంగా తీసుకోవాలని ఆమె కోరారు. వారి ఆశయాలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత నేటి యువతలో ఉందన్నారు.

గిరిజ‌న మ‌హిళ‌కు అత్యంత గౌర‌వం ఇచ్చిన‌ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు.
స్వతంత్రం సిద్ధించి 75 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అజాదీకా అమృత మహోత్సవంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో స్వతంత్ర ఉద్యమకారులను గుర్తు చేసుకోవాలని పిలుపు మేరకు ఈరోజు ఈ వేడుక నిర్వహించుకోవడానికి కారణమైందని ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి తెలిపారు. అంతేకాకుండా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకి భారతదేశ అత్యున్నతమైన ప్రథమ పౌరురాలు పదవిని అలంకరించినందుకు ఒక గిరిజన శాసనసభ్యులుగా ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఎంతోమంది వ్యక్తులు ముఖ్యమంత్రులుగా, ప్రధాన మంత్రులుగా బాధ్యతలు చేపట్టినా, గిరిజనులకు అంతటి అత్యున్నత పదవి బాధ్యతలు అప్పగించి ఆ గౌరవాన్ని అందించిన వ్యక్తి నరేంద్ర మోడీఅని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న గిరిజన యోధులందరినీ గుర్తించి, ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడం శుభ పరిణామన్నారు. గాం గంటం దొర కుటుంబ సభ్యులకు ఇల్లు నిర్మాణంలో తమ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గంట దొర కుటుంబ సభ్యుల్లో నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపించే ఆలోచన కూడా చేస్తున్నట్లు, ఈ విషయంపై ఇదివరకే ఐటిడిఏ పీవో అభిషేక్ తో చర్చించినట్లుగా తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీపీ బ‌డుగు ర‌మేష్‌, జెడ్పీటీసీ వారా నూక‌రాజు, పీఎసీఎస్ చైర్మ‌న్ సూరిబాబు, క్ష‌త్రియ సేవా స‌మితి అధ్య‌క్షులు నాని, స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లు శోభా సోమేశ్వ‌రి, షేక్ మీరా, బీసీ డైరెక్ట‌ర్ గాడి నాగ‌మ‌ణి, బుజ్జి, సినియ‌ర్ నాయ‌కులు గాడి స‌త్తిబాబు, మ‌హేష్‌, అప్పారావు, కొమ్ముక శేఖ‌ర్‌, ముస‌లినాయుడు, ఎంపీటీసీ గాంధీ, స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వైయ‌స్ ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు…