ఆంధ్రప్రదేశ్న్యూస్రాష్ట్రీయంసంపాదకీయం

జర్నలిజం మౌలిక సూత్రాలకు అనుగుణంగా మీడియా పని చేయాలి – సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు

విజయవాడ, కోస్తాటైమ్స్ (మే -18) : జర్నలిజం మౌలిక సూత్రాలకు విరుద్ధంగా, ఇష్టారీతిగా ప్రస్తుతం కొన్ని  మీడియా వర్గాలు వార్తలు ప్రచురించడం శోచనీయమని, సీఆర్.మీడియా అకాడమీ చైర్మన్  కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఠాగూర్ లైబ్రరీలో బుధవారం జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిజం “క్రాస్ రోడ్స్” వద్ద దిక్కుతోచని స్థితిలో వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ధోరణిని పాత్రికేయులే సరిదిద్దాలని ఆయన పేర్కొన్నారు. జర్నలిజం మౌలిక సూత్రాల ప్రకారం తమకు నష్టం కలిగినా,వాస్తవాన్ని మాత్రమే వార్తగా ప్రచురించాల్సి వుందన్నారు. ఆరోపణలకు గురైనవారి కథనం లేకుండా వార్త ప్రచురించడం ఈ సూత్రాలకు పూర్తి విరుద్ధమని జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. రాజకీయ పరంగా వారి వారి సంబంధాలు ఎలా వున్నా, జరుగుతున్న సంఘటనల్ని వక్రీకరించడం సరైన పద్దతి కాదన్నారు. అదేవిధంగా, ఒకే అంశంపై ప్రాంతాలవారీగా విభిన్న సూత్రీకరణలు, వార్తా కథనాలు వెలువడుతుండడం ఇటీవల కాలంలో పెరిగి పోయిందన్నారు. ఇదంతా జర్న లిజంలో నైతిక సూత్రాలను పాటించక పోవడం వల్లనే జరుగుతోందన్న విషయం అంద రూ గుర్తుంచు కోవాలని ఆయన కోరారు. ..

పాత్రికేయులందరూ తమ తమ సంఘాల పరిధిలో పనిచేస్తూనే, ఉమ్మడి సమస్యల పట్ల ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. సీఆర్. మీడియా అకాడమీ అన్ని జర్నలిస్టుల యూనియ న్లతో స్నేహ పూర్వక వాతావర ణం కలిగి వుంటుందని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులు అందరితో కలిసి పనిచేయాలని కోరుకుంటుందని ఆయన అ న్నారు.  అటువంటి స్నేహ పూర్వక వాతావరణం యేర్పడేందుకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. సీఆర్. మీడియా అకాడమీ ఇటీవల ప్రవేశ పెట్టిన జర్నలిజంలో డిప్లమా కోర్సులో 310 మంది చేరి ప్రతిరోజూ ఉదయం 8గం టల నుంచి 10 గంటల వరకు ఆన్‌లైన్ తరగ తులకు హాజరవుతున్నారని ఆయన వివరించారు. డిప్లమో కోర్సుల్లోని సిలబస్‌తో పాటు ప్రతి శనివారం సామాజిక, ఆర్ధిక, పరిపాలన వంటి అంశాల మీద ప్రముఖులతో ఆన్ లైన్ విధానంలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.  ఈ అవగాహనా తరగతులలో పాల్గొని పలు అంశాల పై విజ్ఞానం పెంచుకోవాలని జర్నలిస్టులకు ఆయన సూచించారు. త్వరలోనే, రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులు ఈ అవగాహన తరగతుల్లో పాల్గొని, ప్రధాన అంశాలపై అవ గాహన కల్పించనున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే “లింక్” ను అన్ని జర్నలిస్టుల యూనియన్లకు పంపుతామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనల్లో అక్కడి జర్నలిస్టులకు కూడా అవగాహ న తరగతులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కాకినాడ జిల్లాలో “మడ అడవుల”సంరక్షణపై అవగాహన కల్పించామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో “గుడ్ గవర్నెన్స్” పై అవగాహన కల్పించామన్నారు.ఈ కార్యక్రమం లో చీఫ్ ఇన్ఫర్మే షన్ కమీషనర్ ఆర్.ఎం. భాషా,అధికార భాష కమిటీ అధ్యక్షులు విజయబాబు, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్. వెంకటరావు, ప్రధాన కార్యదర్శి జి. ఆంజనే యులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జర్నలిస్టులు పాల్గొ న్నారు…