హైదరాబాద్, ఫిబ్రవరి 2 (న్యూస్టైమ్): రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్రంలో తనిఖీలు, రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై కంప్లయన్స్ భారాన్ని సరళతరం చేసి, తగ్గించాలని ఆ శాఖలను ఆదేశించారు. బీఆర్కేఆర్ భవన్లో రెవెన్యూ (సీటీ అండ్ ఎక్సైజ్), సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్, ఎనర్జీ, హోం, ఎంఅండ్ యూడీ, డీపీఐటీ (డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) అనే 7 విభాగాల్లో కాంప్లయన్స్ భారాన్ని తగ్గించడంపై నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు.
కాంప్లయన్స్ భారం తగ్గించడంపై స్టేటస్ రిపోర్టులను సమీక్షించేటప్పుడు, ప్రక్రియలను సరళతరం చేయాలని, ఆన్లైన్లో చేయాలని, రాష్ట్రంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న యూజర్ యాంగిల్ని భౌతికంగా చూడాలని చీఫ్ సెక్రటరీ అధికారులను ఆదేశించారు. 28, ఫిబ్రవరి, 2021 నాటికి సరళీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశించారు. దీనికి అదనంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విజన్ ప్రకారం, ఇతర డిపార్ట్మెంట్లు కూడా తమ డిపార్ట్మెంట్ల్లోని కీలక పాయింట్లను చూడాలని, కాంప్లయన్స్ భారాన్ని తగ్గించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు.