ఆంధ్రప్రదేశ్న్యూస్విశాఖపట్నంసంస్కృతి

పంచదార్ల పుణ్య క్షేత్రాన్ని గ్రావెల్ దొంగల నుండి కాపాడండి. – హిందూ సంఘాల ఐక్య వేదిక

ఎలమంచిలి: విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలంలో ఈరోజు  శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వెలసి యున్న కొండపైన,శివ దైవ క్షేత్రం, చారితాత్మక పుణ్య క్షేత్రం పంచదార్ల కొండను త్రవ్విన ప్రదేశాన్ని ఈరోజు హిందూ సంఘాల  ప్రతినిధులు పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా గర్భ గుడిని ఆనుకొని వెనక వైపు బుగర్భ జలాల్ని తవ్వి అక్కడ టన్నుల  కొద్దీ కంకరని తీసి బయటకు పంపించి వేశారు. గర్భ గుడిలోనికి వీలే జలాన్ని తవ్వేశారు. పురాతనమైన సంపదను అధికారదాహంతో ఇలా చేయడం మంచిది  కాదని హిందూ సంఘాలు డిమాండ్ చేసాయి.  గత కొన్ని రోజులుగా ఇలాంటి అక్రమాలు జరిగినా చీసి చూడనట్టుగా వదిలివేసిన అధికారులు ఎంఆర్వో, ఆర్ ఐ, విఆర్ఓ,అలాగే దేవాలయ ఈ.వో ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. దీని వెనుక అధికారుల హస్తం ఉందని అనుమానం కలుగుతుందని అని అన్నారు. పంచదార్ల ఊరికి ఆనుకుని ఉన్న కొండ మీద ఏలాంటి కార్యక్రమం చేసిన లోకల్ గా ఉన్న అధికారులకు తెలుస్తుంది. అలాగే ఎండోమెంట్ డిపారర్ట్మెంట్ అధికారులు పర్యవేక్షణ కూడా విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్, పర్యవేక్షణ ఉంటుంది. కానీ మీడియాకి తెలిసిన తరువాత అధికారులు స్పందించడం కరెక్ట్ కాదన్నారు. దీనిమీద కలెక్టర్ అధ్యక్షతన త్రిసభ్య కమిటీ వేసి కొండను కంకర తవ్విన వ్యక్తులను వారికీ సహకరించిన అధికారులపై తక్షనమే చర్యలు తీసుకోవాలని రానున్న రోజుల్లో దీనిమీద ఆందోళన నిరహిస్తామని, పంచదార్ల  కొండ కి 1000 ఏళ్ళ చరిత్ర  ఉందని, అలాంటి సంపదని నిర్లక్ష్యం గా కొల్లగొట్టడం చాలా దారుణమని అందులో ఎండోమెంట్ మరియు రెవిన్యూ అధికారుల హస్తం  ఉందని అనుమానాలు కలుగుతున్నాయాన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు సమరత సేవా ఫౌండేషన్  కన్వీనర్ పడాల శ్రీరాములు,యలమంచిలి బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రాజాన సన్యాసినాయుడు,రాష్ట్ర బిజెపి సైనిక్ సెల్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు,అచ్యుతాపురం మండల అధ్యక్షుడు రాజన రాజు,అనకాపల్లి మైనారిటీ మోర్చా అధ్యక్షుడు ఇబ్రహీం బాషా, యలమంచిలి అధ్యక్షుడు పిట్టా దాసుబాబు, పప్పు ఈశ్వరరావు,నక్క శివ శంకర్, నాగుమంత్రి శ్రీనివాస్,నూకరాజు,ఓరుపుల జైశంకర్, మహిళా నాయకులు ఎం ధనలక్ష్మి జనసేన మండల అధ్యక్షుడు పప్పల నూకన్న దొర ముఖ్యలు పాల్గొని నిందుతుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు…