జాతీయంరాష్ట్రీయంసంస్కృతి

భారతీయ సంస్కృతికి శ్రీరాముడు ప్రతీక.

అయోధ్య చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం.

అయోధ్య (ఉత్తర ప్రదేశ్ ): ప్రజలంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న అపూరూప ఘట్టానికి నేడు అంకురార్పణ జరిగింది. అయోధ్య లో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది..ఈ సందర్భంగా మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జై శ్రీరాం నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
ఈ నినాదం కేవలం భారత్‌లోనే కాక ప్రపంచం అంతా ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు.ఈ మహత్కార్యం సందర్భంగా దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని తెలిపారు.
మందిర నిర్మాణానికి సంబంధించి భూమి పూజకు నన్ను ఆహ్వానించినందుకు “రామ్‌ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్‌కు” ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు మోదీ.
నేడు ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. మందిర నిర్మాణం దేశానికి ఒక ఉద్వేగభరితమైన క్షణమన్నారు.
ఏళ్ల తరబడి కొనసాగిన సుదీర్ఘ నిరక్షణ నేటితో ముగియనుందన్నారు.ఇన్నేళ్లు ఒక గుడారం కింద నివసించిన రాముడికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నామని అన్నారు.
అయోధ్య చరిత్రలో నేడు ఒక సువర్ణ అధ్యాయం..ఈ ఆలయం మన భక్తికి, జాతీయ భావానికి చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. ఆలయం కోట్ల మంది ప్రజల సమిష్టి తీర్మానం శక్తికి ప్రతీక. ఇది భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ నాడు దేశమంత రామమయమయ్యిందని పేర్కోన్నారు.
మందిర నిర్మాణం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. వారందరి త్యాగాల ఫలితమే నేటి మందిర నిర్మాణమన్నారు.ఈ రోజు వారందరికి దేశ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు మోదీ..
భారతీయ సంస్కృతికి రాముడు ప్రతీక. మందిర నిర్మాణంతో చరిత్ర సృష్టించడమే కాక.. చరిత్ర పునరావృతమవుతోంది.నదిని దాటడానికి రాముడికి గుహుడు సాయం చేశాడు.గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి కృష్ణుడికి పిల్లలు సాయం చేశారు.
అలానే అందరి ప్రయత్నం, కృషితో మందిర నిర్మాణం పూర్తవుతుందన్నారు.మందిర నిర్మాణంతో అయోధ్య రూపు రేఖలు మారిపోతాయి.దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తారు. దాంతో ఆర్థికంగా కూడా అభివృద్ధి జరుగుతుందన్నారు.మానవుడు రాముడిని విశ్వసించినప్పుడల్లా పురోగతి జరిగిందని మనం గుర్తుంచుకోవాలి.
ఆ మార్గం నుంచి తప్పుకున్నప్పుడల్లా.. విధ్వంసం తలుపులు తెరవబడ్డాయి.
మనం అందరి మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలి. అందరి మద్దతు, నమ్మకంతో ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షించాలి’ అని మోదీ కోరారు.అయోధ్యలో నిర్మించబోయే మందిరం శ్రీరాముని పేరు వలే.. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతున్నానన్నారు.ఇది సమస్త మానవాళిని ప్రేరేపిస్తుందని నా నమ్మకం. రాముడు అందరి వాడు..ప్రతి ఒక్కరిలో ఉన్నాడు అన్నారు మోదీ. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణం శిలాఫలాకాన్ని మోదీ ఆవిష్కరించారు..రామ మందిర నిర్మాణ చిహ్నంగా పోస్ట్‌ల స్టాంప్‌ను విడుదల చేవారు.
ఈ కార్యక్రమంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్,ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌,యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, బాబా రాందేవ్ , సాద్వి ఉమాభారతి,సాద్వి ఋతంభర తదితర ప్రముఖులు పాల్గొన్నారు…